నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 06 : అంగళ్ళు సమీపంలో గల డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం మరియు మిట్స్ ఐ.ఐ.సి వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం జావా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శశాంక్ విద్వాన్, సీనియర్ టెక్నికల్ ట్రైనర్, బైట్స్ ఇండియా కంపెనీ, కోయింబత్తుర్, తమిళనాడు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీ రంగంలో జావా డెవలపర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో కెరీర్ అవకాశాలను విస్తరించడానికి జావా ఒక బలమైన పునాది అని అన్నారు. సాఫ్ట్వేర్ నిపుణులుగా ఎదగాలనుకునే విద్యార్థులకు జావా ప్రోగ్రామింగ్ చాలా ముఖ్యమని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాఫ్ట్వేర్ అభివృద్ధి, వెబ్ మరియు మొబైల్ అప్లికేషన్లు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్లలో జావా విస్తృతంగా ఉపయోగించబడుతున్న నేపథ్యంలో, ఈ భాషలో ప్రావీణ్యం సాధించడం అత్యంత అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లు, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్పై ప్రాక్టికల్ శిక్షణ అందించడంతో పాటు స్ప్రింగ్, హైబర్నేట్ వంటి ఆధునిక ఫ్రేమ్వర్క్లపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రాక్టికల్ ప్రాజెక్టులు, కోడింగ్ వ్యాయామాలు మరియు ఇంటర్న్షిప్ అవకాశాల ప్రాధాన్యాన్ని వివరించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐటీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్స్ డాక్టర్ చొక్కనాథన్, ఎమ్.వాసుదేవన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News