నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 ః మండలంలోని ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను శాంతియుతంగా సామరస్యంగా జరుపుకోవాలని ఎస్సై అనిల్ కుమార్ ముస్లిం సోదరులను కోరారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఆయన ముస్లింలతో సమావేశమై మాట్లాడుతూ బక్రీద్ పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా సోదర భావంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండలంలోని ముస్లిం సోదరులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News