Saturday, 12 September 2026 12:07:53 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్

Date : 11 September 2026 09:00 PM Views : 54

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె / బి.కొత్తకోట - సెప్టెంబర్ 11 : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల లోని ప్రజల సమస్యలపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తంబళ్లపల్లె నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం బి కొత్తకోట లోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గస్థాయి ప్రజా దర్బార్ సమావేశంలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత వైకాపాలనలో చేసిన భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని హెచ్చరించారు. రెండు దశాబ్దాలుగా తంబళ్లపల్లె రాజకీయ జీవితంలో నియోజకవర్గంలో ఒక్క సెంటు భూమి లేదని ఎక్కడి నుండో వచ్చిన వలస నాయకులకు వందలాది ఎకరాలు ఎలా వచ్చాయని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత ఏడు సంవత్సరాలుగా టిడిపి, కూటమి నాయకులు తో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నేటి నుండి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల పరిధిలో ప్రతి సమస్యను ప్రతి శాఖ అధికారి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. వారానికి ఒక్కసారి ప్రజల సమస్యలపై జరిగే రివ్యూ మీటింగ్ లో సమస్యలు నా దృష్టికి రాకూడదని హుకుం జారీ చేశారు.అనంతరం ప్రజా దర్బార్ లో ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను ఆలకించి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, ఉపాధి, పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించడానికి సూచనలు చేశారు. ప్రజలు తమ సమస్యలను టిడిపి కూటమి నాయకుల దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కారానికి నాతో పాటు మా నాయకులు అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు సైతం ప్రతి గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సమస్యను పరిష్కరించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించిన 2047 విజన్ స్థాపనకు సహకరించాలన్నారు.ఈ ప్రజా దర్బార్ లో మహిళా నాయకురాలు పర్వీన్ తాజ్, ఆరు మండలాల టిడిపి మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ ను ఆరు మండలాల నుండి తరలివచ్చిన నాయకులు ఘనంగా సత్కరించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :