నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - ఏప్రిల్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన జలధార పథకం అమలుకు అవసరమైన ప్రణాళిక లను సంపూర్ణం గా సిద్ధం చేయాలని సూచించిన ఎంపీడీఓ గంగయ్య. ఎంపీడీఓ కార్యాలయం లో ఉపాధి సిబ్బంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్ లతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం లో ఎంపీడీఓ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం లో పడే వర్షం నీరు వృధా కాకుండా చెరువు లకు చేరేవిధంగా అన్ని కాల్వలను ఉపాధి హామీ పథకం ద్వారా పూడిక తీయాలనీ అలాగే చెరువు ల అభివృద్ధికి, జలధార లో చేపట్టే పనులకు స్థానికులు, ఆయకట్టు దారులు సహకరించాలని కోరారు, పనుల గుర్తింపు లో కూడా ప్రజల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. ఈ సమావేశం లో APD చందన, AE నరసింహులు, APO సుబ్రహ్మణ్యం, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News