నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 25 : మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో టమోటా మార్కెట్ ను సందర్శించి, రైతుల సమస్యలపై మండి యాజమానులతో సమీక్షించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ సందర్బంగా రైతులు రాత్రి పూట బస చేసేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతులు విశ్రాంతి, రాత్రి పూట బస చేసేందుకు రైతు భవన్, మార్కెట్ యార్డ్ లో బాత్ రూమ్ లను నిర్మించేందుకు ప్రత్తిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే నిర్మించే కార్యక్రమం చేపట్టుతానని రైతులకు హామీ ఇచ్చన ఎమ్మెల్యే షాజహాన్ భాషా. ఈ కార్యక్రమంలో మండి యాజమానులు, హమాలి కూలీలు, రైతులు, పాల్గొన్నారు.
Reporter
Namitha News