Friday, 19 June 2026 03:17:26 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు

Date : 30 April 2026 08:09 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 30 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎన్‌సీసీ విభాగానికి చెందిన క్యాడెట్లు అడ్వెంచర్ క్యాంపులో విశిష్ట ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఎన్‌సీసీ విభాగం నుండి వై. హర్షిత, ఎస్.కె. సానియా హఫ్సా అనే ఇద్దరు విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని మనాలి లో గల అటల్ బిహారి వాజపేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ నిర్వహించిన పది రోజుల అడ్వెంచర్ క్యాంపులో పాల్గొన్నారు. భారతదేశంలోనే అత్యుత్తమ సాహస క్రీడల శిక్షణా కేంద్రంగా పేరుపొందిన ఈ సంస్థలో రాక్ క్లైంబింగ్, రాపెలింగ్, రివర్ క్రాసింగ్ వంటి సాహస కార్యక్రమాలతో పాటు సుమారు 10,200 అడుగుల ఎత్తులో పర్వతారోహణ (మౌంటెన్ ట్రెక్కింగ్) నిర్వహించబడగా, మౌంటెన్ రెస్క్యూ విధానాలపై కూడా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, ఇలాంటి కఠిన శిక్షణల ద్వారా క్యాడెట్లలో ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, దేశ సేవకు సిద్ధమయ్యే గుణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతి క్యాడెట్ దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. 2 నుండి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో 10 రోజులపాటు కష్టపడి శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి సర్టిఫికెట్లు అందుకున్న క్యాడెట్లు వై. హర్షిత, ఎస్.కె. సానియా హఫ్సాలను యూనివర్సిటీ ఫౌండర్ & చాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో చాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్ మరియు ఎన్‌సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని కల్పించిన 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మౌనిష్ మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ లోగనాధన్ లకు కృతజ్ఞతలు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :