నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల యందు ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం చైతన్య సంస్థ తన వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపి ఆనంద్ గారు కోశాధికారి పట్నం గిరిజన్మల గారు పరిపాలన అధికారి డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారు ప్రధాన కార్యదర్శి ఈ కవిత రాణి గారు మరియు ముత్తు ఆంగ్ల మాధ్యమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆనంద వృద్ధాశ్రమ వృద్ధులు మా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలవేసి తెలుగు ఔనత్యాన్ని గొప్పతనాన్ని స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తమ ఉపన్యాసాలతో మాతృభాష గొప్పతనాన్ని పిల్లలకు వివరించారు పిల్లలు మాతృభాష గొప్పతనం గురించి వివరిస్తూ ఉపన్యాసాలు పాటలు మరియు సూక్తులు, వివిధ రకాల వేషధారణతో అలరించారు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధుడైనటువంటి నారప్ప గారు మంచి తెలుగు పాటతో అందరినీ అలరించారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ పట్నం గిరిజమ్మాల్ గారు మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు వాటి కోసం ఎంతోమంది కవులు పోరాడారు అందులో మా తెలుగు గొప్పతనాన్ని అందరికీ తెలియజేసిన శ్రీకృష్ణదేవరాలకు గొప్పతనాన్ని వివరించారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ పరిపాలన అధికారి డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వారి మధ్య ఏర్పడిన ఉద్యమం వలన యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదన చేయగా వాటిని మనం ఆచరిస్తున్నాం ప్రతి ఒక్కరూ మాతృభాషలో అనర్గళంగా సంభోదిస్తే అన్ని భాషలు ఆచరించనట్లు అవుతుందని కొనియాడారు సమస్త ప్రధాన కార్యదర్శి ఈ కవితా రాణి గారు మాట్లాడుతూ భారతదేశం ఎన్నో మతాలకు జాతులకు భాషలకు ప్రాధాన్యతిస్తూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ అన్ని మతాలని ప్రోత్సహిస్తూ ఉన్నది ఏకైక దేశం మనదే భారతదేశం. ప్రపంచంలోనే అన్ని దేశాలలో కన్నా మన దేశంలో మాతృభాషా దినోత్సవం అన్ని భాషల వారికి ప్రాధాన్యతీస్తూ చేస్తుంది ప్రతి పాఠశాలలోనూ అంతర్జాతీయ మాతృభాష ద్వారా మన భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలు మాతృభాష అయినటువంటి తెలుగు ప్రసంగించడం దాని ప్రాముఖ్యత పిల్లలకు తెలియజేయడం వలన అందరూ మాతృభాషని గౌరవించవలసిందిగా కోరారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందం గారు మాట్లాడుతూ తెలుగును మాట్లాడి తెలుగు భాషను గౌరవిద్దాం అని పిల్లలందరూ అందరికీ హితవు పలికారు ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు చిన్నారులు మరియు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులు పాల్గొన్నారు
Reporter
Namitha News