నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 17 : తంబళ్లపల్లె మండల పరిధిలోని సమస్యల పరిష్కారానికి రూ 28 లక్షలు మండల పరిషత్ అభివృద్ధి నిధులతో పనులు వేగవంతం చేయనున్నట్లు ఎంపీపీ శ్యామలాకోటిరెడ్డి విలేకరులకు తెలిపారు. మండలంలోని కోసువారిపల్లి, కొటాల, గుండ్లపల్లి, రేణుమాకులపల్లి, ఎద్దులవారి పల్లి, బాల్ రెడ్డి గారిపల్లి, పరుసతోపు, గోపి దిన్ని, తంబళ్లపల్లె, రెడ్డికోట, పంచాయతీలలో తాగునీటి మోటార్లు, పైప్ లైన్లు, గ్రావెల్ రోడ్లు, సిసి రోడ్లు పనులకు నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.
Reporter
Namitha News