నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 13 : పిల్లలకు పరీక్షలు పూర్తయి జులై 12 వరకు సెలవులు ఉండటంతో ఇంటిపట్టున ఉండే పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆత్మకూరు ఎస్సై జిలాని సూచించారు. ముఖ్యంగా వేసవి వేడితో పిల్లలు ఇళ్లలో చెప్పకుండా చెరువులు, కుంటలు, నది ప్రాంతాలకు వెళ్లి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్తుంటారని ఈత తెలియని చిన్నారులు నీటిలో దిగి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు ముందస్తుగానే వారి కదిలికపై ప్రత్యేక దృష్టి సారించి పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Reporter
Namitha News