నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 17 : మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ మూడవ సంవత్సరం డేటా సైన్స్కు చెందిన 45 మంది విద్యార్థులు మరియు అధ్యాపకుల బృందం కలిసి ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక సిస్కో (Cisco) కంపెనీని సందర్శించారు. విద్యార్థులకు పరిశ్రమ అనుభవం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన కల్పించడమే ఈ విజిట్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిస్కో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఇంజినీరింగ్) మల్లి రావు డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI), నెట్వర్కింగ్ టెక్నాలజీలు మరియు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి తాజా సాంకేతిక అంశాలపై అవగాహనాత్మకమైన మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. సిస్కోలో ప్రస్తుత పరిశోధనలు, ఆధునిక సాంకేతిక అభివృద్ధులు మరియు భవిష్యత్ టెక్నాలజీ ధోరణులపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి రంగాల్లో సిస్కో సంస్థ విస్తృతంగా పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు నూతన జెనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకుని, భవిష్యత్ కెరీర్కు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.కిరణ్ కుమార్,బి విద్యశ్రీ ల బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News