Tuesday, 14 April 2026 05:37:43 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

Date : 13 April 2026 09:11 AM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 13 : బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి ప్రస్తుతం మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ ) జీవి.పల్లవి కి అరెస్ట్ కు హైకోర్టు ఈనెల 2న ఉత్తర్వు జారీ చేసింది. ఆమెను అరెస్ట్ చేసి ఈనెల 30న న్యాయస్థానం ముందు హజరుపర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని, అక్రమంగా జరుగుతున్న ఈ పనిని కమిషనర్ అడ్డుకోలేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపారని పేర్కొంటూ రెడ్డెప్ప అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తుండగా విచారణ కోసం పల్లవి ని ఆన్ లైన్ లో హజరు కావాలని తెలియజేసినప్పటికి ఆమె హజరు కాలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తూ ఆమెకు బెయిలబుల్ అరెస్టు వారంట్ ను జారీ చేయాలని న్యాయ స్థానం ఆదేశించింది. ఈనెల 30 జరిగే తదుపరి విచారణ రోజు ఆమె కోర్టు ఎదుట హజరుకావాలని ఆదేశించింది. ఈ వారెంట్ ను అమలు చేయాలని జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలను పంపారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే రూ.10వేల బాండు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈనెల 30న జరిగే కేసు వాయిదాకు హజరవుతానని, ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశించే వరకు హజరువుతానని ఆమె ప్రమాణపత్రం ఇవ్వాలని ఆదేశాల్లో న్యాయస్థానం పేర్కొంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :