Thursday, 16 April 2026 03:05:08 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

తంబళ్లపల్లె లో ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల కవాతు

Date : 23 March 2026 07:33 AM Views : 80

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 22 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు. ఉదయం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ అడ్రస్ కోడ్ తో ఎంపీడీవో కార్యాలయం నుండి క్రాస్ రోడ్డు మీదుగా ఐటిఐ, పాత బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, జూనియర్ కాలేజ్ మీదుగా తంబళ్లపల్లె పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పాత జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు క్రమశిక్షణ తో కూడిన సమాజ నిర్మాణ లక్ష్యం కోసం పనిచేయాలని సూచించారు. జాతీయ వాదం, దేశ సాంస్కృతిక హిందూ జాతీయ వాదాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులతోపాటు బిజెపి సీనియర్ నాయకుడు రమణారెడ్డి, మండల బిజెపి అధ్యక్షుడు రమణ, మగ్గాలు లక్ష్మయ్య, మాజీ అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి, శంకర్ రెడ్డి, యుగంధర్, శంకర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :