నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 22 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు. ఉదయం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ అడ్రస్ కోడ్ తో ఎంపీడీవో కార్యాలయం నుండి క్రాస్ రోడ్డు మీదుగా ఐటిఐ, పాత బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, జూనియర్ కాలేజ్ మీదుగా తంబళ్లపల్లె పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పాత జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు క్రమశిక్షణ తో కూడిన సమాజ నిర్మాణ లక్ష్యం కోసం పనిచేయాలని సూచించారు. జాతీయ వాదం, దేశ సాంస్కృతిక హిందూ జాతీయ వాదాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులతోపాటు బిజెపి సీనియర్ నాయకుడు రమణారెడ్డి, మండల బిజెపి అధ్యక్షుడు రమణ, మగ్గాలు లక్ష్మయ్య, మాజీ అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి, శంకర్ రెడ్డి, యుగంధర్, శంకర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News