నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 05 :: బళ్లపల్లె మండలంలోని 594 మహిళా సంఘాలకు ఇండియన్ బ్యాంకు ద్వారా 2025-26 ఆర్థిక ఏడాదికి రూ 42 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఐకెపిలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా సంఘాల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 252 సంఘాలకు రూ 22 కోట్లు రుణం పంపిణీ చేశామని మరో 60 సంఘాలకు రూ 11 కోట్లు పంపిణీ జరుగుతుందన్నారు. ఏపిఎం గంగాధర్ మాట్లాడుతూ శ్రీనిధి ద్వారా 7 కోట్ల రుణాల పంపిణీకి గాను ఇప్పటికి రూ 4.72 కోట్లు పంపిణీ జరిగినట్లు చెప్పారు. పాల డైరీలో 6100 లీటర్ల పాల సేకరణ జరుగుతుందని పాల ఉత్పత్తిదారులకు సైతం బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీకి సహకరించిన బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఏపీఎం తోపాటు సీసీలు, మండల సమైక్య సభ్యులు, మహిళా సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి మేనేజర్ అమరావతి,పాల డైరీ సి.సి సుజాత, సి.సి.లు కత్తి నరసింహులు,రమణ, ఆదిలక్ష్మి, భాష , సంఘమిత్రలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.
Reporter
Namitha News