నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 10 : తంబళ్లపల్లె మండలం లోని జిల్లాలోనే అతిపెద్ద పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ స్పందించి పరిష్కరించాలని పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ కోరారు. మంగళవారం 2047 విజన్ టీం సభ్యులు పెద్దేరు ప్రాజెక్టు సమస్యలను అధ్యయనం చేశారు. వారికి చైర్మన్ శివకుమార్ పెద్దాయన ప్రాజెక్ట్ లోని సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి వివరించారు.పెద్దేరు ప్రాజెక్టుకు రహదారి మరమ్మతులు, పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం, చేప పిల్లల పెంపకం యూనిట్, ప్రాజెక్టు కింద బ్రిడ్జి నిర్మాణం, గెస్ట్ హౌస్ లు, ప్రధాన కాలవలు, పిల్ల కాలవలు మరమ్మతులు, ప్రాజెక్ట్ కింద మరమ్మతులు,పార్కుల సుందరీ కరణ, పనులు చేపట్టాలని వారికి విశదీకరించారు.ప్రాజెక్టు ఆయకట్టలో సుమారు 5000 ఎకరాలు సాగుతో పాటు రెండు మండలాల వేలాది మంది రైతులకు వ్యవసాయం తోపాటు కూలీలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రెండేళ్లుగా ప్రాజెక్ట్ పార్క్ అలనా పాలనా లేక అడవిని తలపిస్తుండగా సౌకర్యాలు లేక పర్యాటకులు రాకపోకలు నిలిచి నిర్మానుషంగా తయారైంది. నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇక్కడ అధికార పార్టీకి ఇన్చార్జి లేక ప్రాజెక్ట్ అభివృద్ధి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా కలెక్టర్ గారి స్పందించి వెంటనే 2047 విజన్ కార్యక్రమంలో ప్రాజెక్టు చేపడితే వేలాదిమంది రైతులు, కూలీలకు జీవనోపాధి తో పాటు వేలాది మంది పర్యాటకులను ఆకర్షించి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు కావడం ఖాయం. *పదవి తప్ప ₹10 లేవు. ప్రాజెక్టు అభివృద్ధి ఎలా సాధ్యం* చైర్మన్ కొటాల శివకుమార్. పేరుకు జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టు. చైర్మన్ అయిన నాటి నుండి ఒక పైసా నిధులు లేవు అభివృద్ధి ఎలా చేయాలి. ప్రాజెక్టు సమస్యలపై రాష్ట్రస్థాయి మంత్రులు, అధికారులకు ఫిర్యాదులు చేశాను. కలెక్టర్ గారైన స్పందించి 2047లో ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను
Reporter
Namitha News