Thursday, 30 July 2026 05:47:24 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నిజాయితీకి మారుపేరు సర్పంచ్ పసుపులేటి చలపతి

ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం సబబు కాదు కురవంక పంచాయతీ అభివృద్ధికి సొంత నిధులు వెచ్చించారు వార్డు మెంబర్లు గొంగడి కృష్ణమూర్తి, నాగరాజ స్పష్టం

Date : 29 November 2025 04:41 PM Views : 510

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 29: నిజాయితీ,మంచితనానికి కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి మారుపేరని,అటువంటి వ్యక్తిపై అవినీతి ఆరోపణలు చేయడం సమంజసం కాదని వార్డు మెంబర్లు గొంగడి కృష్ణమూర్తి,నాగరాజలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ కురవంక ఉప సర్పంచ్ బైగారి భారతి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పసుపులేటి చలపతి విజయం సాధించారని,ఆయనతోపాటు వార్డు మెంబర్లను గెలిపించుకున్నారని గుర్తుచేశారు.అప్పట్లో చలపతిని బాబాయ్ అంటూ భారతి సంబోధించేదని తద్వారా ఆమెను ఉపసర్పంచిగా నియమించి మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు.మూడు నెలల క్రితం జరిగిన పంచాయతీ సమావేశానికి హాజరై పంచాయతీలో జరిగిన అభివృద్ధి,ఖర్చు చేసిన నిధులపై రిజల్యూషన్ సిద్ధం చేస్తే తాను సైతం సంతకం చేస్తాననన్న విషయాన్ని వారు గుర్తుచేశారు.కేవలం ఉప సర్పంచిపై అవిశ్వాసం తీర్మానం పెట్టామనే నెపంతో సర్పంచ్ పసుపులేటి చలపతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని,ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.నిజంగా సర్పంచ్ అవినీతికి పాల్పడి ఉంటే ఐదుగురు మహిళ వార్డు మెంబర్లు ఉన్నారని ఆ విషయాన్ని ఉప సర్పంచ్ వారి దృష్టికైనా తీసుకెళ్లి ఉండాల్సిందన్నారు.నిరంతరం పంచాయతీ అభివృద్ధి,ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే సర్పంచ్ చలపతిపై దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.అనంతరం మరో వార్డు మెంబర్ నాగరాజు మాట్లాడుతూ కురవంక పంచాయతీని అన్నివిధాల అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు పసుపులేటి చలపతి అన్నారు.నిధులు లేకున్నప్పటికీ సొంత నిధులతో పంచాయతీలోని ప్రజల సమస్యలను ఆయన పరిష్కరించారన్నారు.పంచాయతీలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగిందని,ఎన్నో సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని నిర్మించారని,ఇటీవల కాలంలో 39 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.కురవంక పంచాయతీకి చెందిన పసుపులేటి వినోద్ కుమార్ వాస్తవాలు తెలుసుకోవాలని,మీ తండ్రి స్వర్గీయ పసుపులేటి మోహన్ గురించి,ఆయన అవినీతి గురించి వార్డు ప్రజలకు అంతా తెలుసనన్నారు.వార్డులో మౌలిక సదుపాయాలు,కల్పన తాగునీటి పరిష్కారానికి సర్పంచ్ పసుపులేటి చలపతి విశేష కృషి చేశారని కొనియాడారు.ఆయన సమర్థతను గుర్తించి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు.కేవలం ఆయనపై బురద జల్లడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉపసర్పంచ్ భారతి నిజంగా వారం రోజుల క్రితం రాజీనామా చేసి ఉంటే సబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానానికి ఎందుకు హాజరవుతారని ప్రశ్నించారు.ఇప్పటికైనా సర్పంచ్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలని,పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అనిత,శ్రీనివాసులు,చంద్రిక మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :