Wednesday, 29 July 2026 11:04:13 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఆర్.టి.ఐ. దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడి నుండీ లంచం అడిగిన ప్రభుద్ధుడు

లంచం డబ్బులు తీసుకొంటూ ఏ.సి.బి. కి పట్టుబడిన తహసీల్దార్ చంద్రశేఖర్

Date : 09 December 2025 06:08 PM Views : 426

నమిత న్యూస్ - Andhra Pradesh / Hyderabad : హైదరాబాద్ - డిసెంబర్ 09 :: సాధారణంగా అధికారులు పనులు చేయడానికి, బిల్లులు మంజూరు చేయడానికి లంచాలు తీసుకుంటారు. అక్రమార్కుల గుట్టు బయటపెట్టేందుకు ప్రజలకు ఉన్న వజ్రాయుధం సమాచర హక్కు చట్టం. కానీ ఓ అధికారి ఆర్టిఐ కింద సమాచారం అడిగిన వ్యక్తి నుంచే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆ అవినీతిపరుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా అయితే మీకోసమే.నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలం తెరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తనకు తెలియకుండానే తన తండ్రి పేరు మీద ఉన్న భూమి ఇతరుల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులను సంప్రదించాడు. దీనికి సంబంధించి గతంలో జారీ చేసిన మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని.. భూ యజమాని కొడుకు రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకపోయింది. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి జారీ చేసిన మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ కావాలంటూ ఆర్టిఐ చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. సమాచార హక్కు చట్టం (RTI) కింద వివరాలు ఇచ్చేందుకు పేపర్ ఖర్చుల పేరుతో డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్ 15 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హైదరాబాద్ బాలాపూర్‌లోని తన నివాసంలో డిమాండ్ చేసిన లంచం రూ.15 వేల తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసిబి అధికారులు. ఆర్టిఐ దరఖాస్తు దారుడు నుంచే డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్ లంచం తీసుకోవడంతో ఉద్యోగులంతా ముక్కున వేలేసుకుంటున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: