Sunday, 13 September 2026 07:11:34 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఉమ్మడి భూముల కబ్జా లను అడ్డుకోండి - ఏ.ఐ.టి.యు.సి.

Date : 23 May 2026 06:11 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి . కొత్తకోట - మే 23 : బి.కొత్తకోట గ్రామంలోని ఉమ్మడి భూమిలో ఉన్న పెద్దల సమాధులు, పాత ఇంటి అవశేషాలు, పలవృక్షాలు, బావి, నీటి తొట్టెలను జేసీబీలతో ధ్వంసం చేయడం దారుణం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం, బి.కొత్తకోట గ్రామ పరిధిలో ఉమ్మడి హక్కులతో ఉన్న భూమిలో పెద్దల నాలుగు సమాధులు, పాత ఇంటి గోడలు/మిద్దె, పలవృక్షాలు, బావి, నీటి తొట్టెలను జేసీబీలతో ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన, చట్టవిరుద్ధమైన చర్య అని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి సలీం భాషా బాధితులు శంకరప్ప,తీవ్రంగా ఖండించారు. శనివారం బాదిత కుటుంబ సభ్యులతో కలిసి బి. కొత్తకోట మండల తహశీల్దార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సలీం భాషా,శంకరప్ప మాట్లాడుతూ 1967 సంవత్సరంలో తిపిరి రామప్ప నుంచి రెడ్డివారి వెంకట్రాయప్ప కుమారులు నలుగురు ఉమ్మడిగా ఉన్న భూమిలో కేవలం 1/6 వంతు భూమిని మాత్రమే కొనుగోలు చేసినప్పటికీ, మొత్తం ఉమ్మడి భూమిపై తమకే పూర్తి హక్కు ఉన్నట్టుగా వ్యవహరిస్తూ, ఇతర భాగస్వాముల హక్కులను కాలరాస్తూ అక్రమంగా పెద్దల సమాధులు, పాత ఇంటి గుర్తులు, వృక్షాలు, నీటి వనరులను ధ్వంసం చేయడం అమానుషమని మండిపడ్డారు. పెద్దల సమాధులు అంటే కేవలం మట్టి కట్టలు కావు, అవి కుటుంబాల చరిత్ర, భావోద్వేగాలు, పూర్వీకుల జ్ఞాపకాలు. వాటిని జేసీబీలతో కూల్చివేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, గ్రామీణ సంప్రదాయాలపై దాడి చేసినట్టేనని అన్నారు. ఉమ్మడి భూమిలో హద్దులు నిర్ణయించకుండా, ఇతర భాగస్వాముల అనుమతి లేకుండా ఏకపక్షంగా వ్యవహరించడం చట్టపరంగా కూడా తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, జేసీబీలతో ధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భూమిలో మరింత అక్రమ జోక్యాలు జరగకుండా రెవెన్యూ మరియు పోలీసు శాఖల ద్వారా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే, ఉమ్మడి భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలు, బలవంతపు ధ్వంసాలు, పేద ప్రజల వారసత్వ హక్కులపై దాడులను అరికట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బాదిత కుటుంబ సభ్యులు తిపిరి శంకరప్ప, భార్య పార్వతమ్మ, వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :