నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -జనవరి 04 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు అశ్వ్ 2026 - జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ వెబ్ సైట్ మరియు ప్రమోషనల్ పోస్టర్ లను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి ఆవిష్కరించారు. ప్రతి ఏటా యూనివర్సిటీ నందు నిర్వహించే ఈ ఫెస్ట్ లో విద్యార్థులకు వివిధ పోటీలను టెక్నికల్, కల్చరల్ మరియు స్పోర్ట్స్ విభాగాలలో నిర్వహిస్తున్నామని, 2026 సంవత్సరము మార్చ్ 25 మరియు 26 వ తేదీలలో రెండు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహిస్తామని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఇందులో జాతీయ స్థాయిలో డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని, వివరాలు యూనివర్సిటీ అశ్వ్ వెబ్ సైట్ www.ashv2k.in లేదా www.mits.ac.in లో పొందుపరిచామని ఆయన అన్నారు. ఈ వెబ్ సైట్ నందు రిజిస్ట్రేషన్ వివరాలు మరియు పోటీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని, ఈ కార్యక్రమం లో ప్రతి ఏటా సినీ ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అలరిస్తారని, ఈ సారి కూడా సినీ నేపథ్య గాయకులు మరియు తారలు పాల్గొంటారు అని ఆయన అన్నారు. ఆవిష్కరణ కార్యక్రమం లో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ యెన్ ద్వారకనాథ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, అశ్వ్ - 2026 కన్వీనర్ మరియు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమాల్ బాషా,సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్-అడ్మిషన్స్ డాక్టర్ వి.మారుతీ ప్రసాద్, కో - కన్వీనర్స్ వై. ప్రదీప్ కుమార్, లక్ష్మి ప్రీతీ, స్టూడెంట్ కో ఆర్డినేటర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News