నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 18 : తంబళ్లపల్లి మండలంలోని ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనంలా తయారు కావడానికి కార్యదర్శులు పనిచేసేలా డిప్యూటీ ఎంపీడీవోలు చొరవ చూపాలని ఈ బాధ్యత మీరే తీసుకోవాలని ఎంపీడీవో ఉషారాణి సూచించారు. గురువారం తంబళ్లపల్లె డంపింగ్ యార్డ్ సమస్యపై స్పందించి తంబళ్లపల్లె డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించి సేకరించిన తడి,పొడిచెత్తను వేరుచేసి ఎరువు తయారు చేసి ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టాలని డిప్యూటీ ఎంపీడీవో ఎంవి ప్రసాద్ ను ఆదేశించారు. మండలంలో ప్రతి డంపింగ్ యార్డ్ లో మొక్కుబడిగా చెత్త సేకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యదర్శులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛభారత్ కార్యక్రమాలన్నీ తనదాకా రాకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత మీదేనని డిప్యూటీలకు సూచించారు
Reporter
Namitha News