నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -మార్చ్ 06 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం తో పాటు పరసతోపు పంచాయతీ లో కోటి రూపాయలతో అభివృద్ధి పనులతో తంబళ్లపల్లెకు మహర్దశ పట్టనున్నట్లు డ్వామా పీడీ వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్ కాలనీ సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 2047 విజన్ లో భాగంగా రూ 70 లక్షలతో తొలివిడతగా బస్టాండ్ కాలనీ, శ్రీనివాస కాలనీ, ఇట్నే వారి పల్లి కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు శరవేగంగా జరగడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తంబళ్లపల్లె మండలంలో పూర్తిస్థాయిలో సిసి రోడ్లు నిర్మాణాలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి చేయడానికి చొరవ చూపిస్తున్నట్లు చెప్పారు. సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు నాణ్యత లోపం లేకుండా స్థానిక ప్రజల సమన్వయంతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీలో కోనేరు మరమ్మతు పనులు వేగవంతం చేసి కోనేరు సర్వాంగ సుందరంగా తయారు చేయాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీరాజ్ డిఇ మునిరాజ్, ఏఈ వెంకటరమణ, అభివృద్ధి పనుల స్పెషలాఫీసర్ రెడ్డప్ప, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టి ఏ బాలగంగాధర్, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, ఐసుల కృష్ణ, 20 47 విజన్ సభ్యులు రమణమ్మ, తిప్పమ్మ, కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News