Wednesday, 29 July 2026 01:36:45 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు కింద ప్రతీ ఎకరం సాగు - చైర్మన్ కొటాల శివకుమార్

రైతుల సమీక్ష లో తీర్మానం

Date : 27 November 2025 06:39 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 27 : తంబళ్లపల్లె మండలం లోని పెద్దేరు ప్రాజెక్ట్ ఆయకట్టు క్రింద నున్న ప్రతీ ఎకరం సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ కోరారు. గురువారం ప్రాజెక్టు ఆవరణంలో జరిగిన ఆయకట్టు రైతుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు కుడి కాలువ కింద 8.6 కిలోమీటర్లు ఎడమ కాలువ కింద 8.2 కిలోమీటర్లు సుమారు 4000 ఎకరాలు సాగుకు తీర్మాణించినట్లు తెలిపారు. రైతులు రబీ సీజన్ కు వేరుశనగ, మొక్కజొన్న, వరి, టమోటా, వాణిజ్య పంటలు వేసుకోవాలని సూచించారు. ఆయకట్టు రైతులు నీటి వృధా కాకుండా పంటలు సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు మెంబర్లు గంగిరెడ్డి, శివ నాగిరెడ్డి, తేజ మూర్తి నాయుడు, మాజీ సర్పంచ్ లు కృష్ణమూర్తి నాయుడు, రాము, మాజీ ఎంపిటిసి ఓబులేసు, జనసేన నరసింహులు, డీలర్ నారాయణస్వామి, ఉప సర్పంచ్ రాజన్న, వెంకటస్వామి, కాయలపల్లి మల్లికార్జున, శ్రీనివాసులు, కిట్ట, మల్లయ్య, లస్కర్ శ్రీనివాసులు రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :