నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె/పీటీఎం - సెప్టెంబర్ 04 : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల లోని ప్రజల సమస్యలపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తంబళ్లపల్లె నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం పీటీఎం లోని విజయ గణపతి కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గస్థాయి ప్రజావేదిక సమావేశంలో అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా టిడిపి, కూటమి నాయకులు తో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నేటి నుండి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల పరిధిలో ప్రతి సమస్యను ప్రతి శాఖ అధికారి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అనంతరం ప్రజావేదిక లో ప్రజలను ఆప్యాయంగా పలకరించి గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, ఉపాధి, పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించడానికి సూచనలు చేశారు. ప్రజలు తమ సమస్యలను టిడిపి కూటమి నాయకుల దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కారానికి నాతో పాటు మా నాయకులు అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు సైతం ప్రతి గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సమస్యను పరిష్కరించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించిన 2047 విజన్ స్థాపనకు సహకరించాలన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జయశంకర్ యాదవ్ ను ఆరు మండలాల నుండి తరలివచ్చిన టిడిపి శ్రేణులు ఘనంగా సన్మానించి జయ జయ ద్వానాలు చేశారు
Reporter
Namitha News