నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారిపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య విజయను కిరాతకంగా కొట్టారు. బాధితురాలు విజయ మాట్లాడుతూ...తాము ఇద్దరూ తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమ కులాంతర వివాహం చేసుకున్నామని తెలిపారు. ఈ వివాహం ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చకపోవడంతో మొదటి నుంచి తనపై శారీరక, మానసిక వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె వాపోయారు. ఇటీవల భర్త సుధాకర్ రెడ్డి తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడని, అయినప్పటికీ తనకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త తనపై దాడి చేసిన కారణంగా తాను భయభ్రాంతులకు గురవుతున్నానని, తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని విజయ తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భర్తపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
Reporter
Namitha News