Thursday, 30 July 2026 04:42:58 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

హెచ్.సి.ఎల్ గువి తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ

Date : 05 January 2026 09:52 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 05 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగం వారు చెన్నై కి చెందిన ప్రముఖ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ హెచ్.సి.ఎల్ గువి తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎస్ వినోద్, హెడ్ - ఇన్స్టిట్యూషన్ బిజినెస్, వి.లక్ష్మణ నారాయణన్, సీనియర్ మేనేజర్, హెచ్.సి.ఎల్ గువి కంపెనీ వారు, డాక్టర్ రామనాథన్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్. వినోద్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా అకడమిక్ అధ్యయనం మరియు పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ, విద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి శిక్షణా తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం సి.ఎస్.ఈ, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్, నెట్వర్క్స్ విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక టూల్స్, ప్లాట్‌ఫార్మ్స్ మరియు పరిశ్రమలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై 40 రోజుల పాటు యూనివర్సిటీ నందు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగయోగ్యత, అలాగే ఇంటర్న్‌షిప్స్ మరియు ప్లేస్‌మెంట్స్‌కు అవసరమైన సిద్ధతను మరింత మెరుగుపరుస్తుందని అన్నారు. ఈ ఒప్పందం పరిశ్రమ–విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలనే ఉద్ద్యేశంతో ఒప్పంద పత్రాలపై కంపెనీ హెడ్ ఎస్ వినోద్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో హెడ్- ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్స్ డి.వేణుగోపాల్ చౌదరి, విభాగాధిపతులు డాక్టర్ ఎస్. పద్మ, డాక్టర్ ఆర్.కల్పనా, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, కోఆర్డినేటర్స్ డాక్టర్ ఆర్.రామ్ ప్రియా, శాయీజ్ అహమ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: