నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 21 ః తంబళ్లపల్లె మండల కేంద్రానికి సమీపంలోని ఇట్నేనివారి పల్లెలో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయమై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్యపై స్పందించిన స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి, ఎంపీడీవో పట్నాయక్ ల ఆదేశాలతో శుక్రవారం కార్యదర్శి శ్రీనివాసరావు కోర్టు వద్ద గల బోరుకు కొత్త మోటర్ బిగించి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పద్మావతి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News