నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 03 : తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్య కొండ లో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి చెందిన గోమాతలకు ఓ భక్తుడు ట్రాక్టర్ పశుగ్రాసం వితరణ చేశారు. మల్లయ్య కొండ లోని గోమాతలకు పశుగ్రాసం లేని విషయంపై స్పందించిన తంబళ్లపల్లి మండలం పరసతోపు పంచాయతీ బురుజు గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి, సతీమణి నాగవేణి, కుమారుడు సాఫ్ట్వేర్ గణేష్ కుమార్ రెడ్డి లు వెంటనే ఒక ట్రాక్టర్ లోడ్ పశుగ్రాసాన్ని కొండపైకి తరలించి గోమాతలకు అందించారు. వారు చేసిన దాతృత్వానికి దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండ కిట్ట,మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున, భక్తులు ప్రశంసలు అందజేశారు
Reporter
Namitha News