నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భవన కార్మికుడికి తీవ్ర గాయాలు భవన నిర్మాణ పనులు చేస్తున్న భవన కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లి మండలంలో జరిగింది. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని విజయనగర్ కాలనీ చెందిన వీరభద్ర భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బాబుకాలనీ లో ఓ ఇంటి నిర్మాణ పనికి వెళ్ళాడు. పనులు చేస్తుండగా సారవకట్టెలు జారడంతో పైనుంచి కింద పడి పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బాధ్యతున్ని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి రిఫర్ చేశారు.
Reporter
Namitha News