Saturday, 12 September 2026 01:53:42 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మదనపల్లిలో అర్హులైన చేనేత కార్మికులకు ‘నేతన్న సేవ’ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Date : 25 August 2026 12:19 PM Views : 80

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లిలో అర్హులైన చేనేత కార్మికులకు ‘నేతన్న సేవ’ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చేనేత కార్మికుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ప్రభుత్వం అందిస్తున్న ‘నేతన్న సేవ’ పథకం ద్వారా రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలని చేనేత కార్మికుల ప్రతినిధి వీరభాస్కర్ కోరారు. సొంత మగ్గాలు ఏర్పాటు చేసుకుని చేనేత వృత్తిని కొనసాగిస్తున్న కార్మికులతో పాటు, కూలి మగ్గాలపై పనిచేస్తున్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వర్క్‌షెడ్లు కలిగి ఉండి చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన కార్మికులను కూడా పథకంలో చేర్చాలని కోరారు. ఆగస్టు 7న నిర్వహించిన చేనేత దినోత్సవం సందర్భంగా కొంతమంది అర్హులైన చేనేత కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించినప్పటికీ, ఇంకా అనేకమంది అర్హులకు పథకం అందలేదని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే చేనేత కార్మికులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారని... అనంతరం ఆగస్టు 20వ తేదీన పథకం అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. అయితే గడువు దాటిపోయినా ఇప్పటివరకు అర్హులైన పలువురు కార్మికులకు ఆర్థిక సహాయం అందలేదని పేర్కొన్నారు. కాబట్టి ఉన్నతాధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలని కోరారు. నిజంగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన కార్మికులను గుర్తించి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ‘నేతన్న సేవ’ పథకం ద్వారా రూ.25 వేల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని వీరభాస్కర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల సమస్యను అధికారులు సత్వరమే పరిష్కరించి, అర్హులందరికీ ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :