నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 16 : రామసముద్రం మండలం మినికి గ్రామం లో వెలసియున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, మినికి గ్రామస్థులు తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. గ్రామ ప్రతినిధులు, ఆలయ ధర్మకర్తలు ఆయనను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు విచ్చేసి స్వామివీల్ వారి ఆశీస్సులు పొందడంతో పాటు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ రామ్ చినబాబు ఆహ్వానాన్ని స్వీకరించి, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించారు. గ్రామస్థులు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
Reporter
Namitha News