నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 11 ః గురువారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగే మండల సర్వసభ్య సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి తోపాటు జడ్పిటిసి, మండలంలోని 11 మంది ఎంపీటీసీలు, 21 మంది సర్పంచులు, కో ఆప్షన్ నెంబర్, ప్రత్యేక ఆహ్వానితులు, మండలం లోని అన్ని శాఖల అధికారులతో పాటు టిడిపి తరఫున మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బేరిశ్రీనివాసులు, పురుషోత్తం,వెంకట్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అల్లావుద్దీన్ లకు అనుమతి ఇవ్వాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా కు టిడిపి నేతలు వినతి పత్రం యిచ్చారు. ఆయన ఆమోదించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, వీరాంజనేయులు, సుధాకర్, సురేంద్ర, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News