Thursday, 16 April 2026 07:00:23 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పి.పి.పి. విధానం ను వ్యతిరేకంగా ఈనెల 28 నిర్వహించే ర్యాలీపోస్టర్ ఆవిష్కరణ - నిసార్ అహమ్మద్

Date : 24 October 2025 07:38 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 24 : మెడికల్ కాలేజీల నిర్వహణలో పిపిపి విధానాన్ని కూటమి ప్రభుత్వంలోని బిజెపి, జనసేన పార్టీ నాయకులే వ్యతిరేకత వ్వక్తం‌ చేస్తున్నారని, సంతకాల సేకరణ ఉద్యమంలో తమతోపాటు సంతకాలు చేసి మద్దతు ఇస్తున్నారని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మదనపల్లె అవెన్యూ రోడ్డులోని వైసిపి కార్యాలయంలో ఈనెల 28 న నిర్వహించే ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె వైసిపి పరిశీలకులు అనూష రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మదనపల్లె మెడికల్ కాలేజ్ నిర్మాణంలో పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 28 న సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం, నిర్వహణ పిపిపి విధానం ద్వారా పేదలకు వైద్యం దూరం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :