Tuesday, 15 September 2026 08:56:08 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు వెంకటరమణారెడ్డి

Date : 28 November 2025 08:01 PM Views : 236

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 28: 33 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని అడిగిన రైతు పై వీఆర్వో వేధింపులకు పాల్పడడంతో ఆ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం గుర్రంకొండ మండలంలో జరిగింది. బాధిత రైతు కుమారుడు ఆదినారాయణ రెడ్డి కథనం మేరకు.. గుర్రంకొండ మండలం, వెల్లుట్ల గ్రామం, ఇ పసలవాండ్ల పల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 421 లో 1.5 ఎకరా పొలాన్ని గత 33ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ స్థలానికి పట్టా ఇవ్వాలని పలుసార్లు అధికారులను ఆశ్రయించాడు. అయితే అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. మరోసారి ఈ నెల 17న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు సదరు అనుభవంలో ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణ చేసి బాధితునికి పట్టా ఇవ్వాలని తహసిల్దార్ కు పంపారు. విచారణ చేసి పట్టా ఇచ్చేలా చూడాలని స్థానిక వీఆర్ఒ సదశివా నాయుడు ను ఆదేశించారు. దీంతో విఆర్వో భూమిని పరిశీలించి తనకు రూ.50 వేలు ఇస్తే త్వరగా పట్టా వచ్చేలా చూస్తానని చెప్పాడు. అయితే తమకు అంత స్తోమత లేదని కరుణించి ఈ పేద రైతుకు పట్టా ఇవ్వాలని రైతు వెంకటరమణా రెడ్డి కాళ్లా వేళ్లా పడినా కనికరించిన విఆర్వో పట్టా ఇవ్వకపోగా ఈ భూమిని ఖాళీ చేయాలని హెచ్చరించాడు. దీంతో రైతు వీఅర్ఒ ముందే పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాధితున్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గుర్రంకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: