Thursday, 30 July 2026 03:35:34 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు వెంకటరమణారెడ్డి

Date : 28 November 2025 08:01 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 28: 33 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని అడిగిన రైతు పై వీఆర్వో వేధింపులకు పాల్పడడంతో ఆ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం గుర్రంకొండ మండలంలో జరిగింది. బాధిత రైతు కుమారుడు ఆదినారాయణ రెడ్డి కథనం మేరకు.. గుర్రంకొండ మండలం, వెల్లుట్ల గ్రామం, ఇ పసలవాండ్ల పల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 421 లో 1.5 ఎకరా పొలాన్ని గత 33ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ స్థలానికి పట్టా ఇవ్వాలని పలుసార్లు అధికారులను ఆశ్రయించాడు. అయితే అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. మరోసారి ఈ నెల 17న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు సదరు అనుభవంలో ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణ చేసి బాధితునికి పట్టా ఇవ్వాలని తహసిల్దార్ కు పంపారు. విచారణ చేసి పట్టా ఇచ్చేలా చూడాలని స్థానిక వీఆర్ఒ సదశివా నాయుడు ను ఆదేశించారు. దీంతో విఆర్వో భూమిని పరిశీలించి తనకు రూ.50 వేలు ఇస్తే త్వరగా పట్టా వచ్చేలా చూస్తానని చెప్పాడు. అయితే తమకు అంత స్తోమత లేదని కరుణించి ఈ పేద రైతుకు పట్టా ఇవ్వాలని రైతు వెంకటరమణా రెడ్డి కాళ్లా వేళ్లా పడినా కనికరించిన విఆర్వో పట్టా ఇవ్వకపోగా ఈ భూమిని ఖాళీ చేయాలని హెచ్చరించాడు. దీంతో రైతు వీఅర్ఒ ముందే పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాధితున్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గుర్రంకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :