నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 01 : టైలర్స్ డే సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని టైలరింగ్ వృత్తిదారులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. టైలర్లు తమ షాపు లను మూసివేసి ఒకరినొకరు టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా ర్యాలీ లో పాల్గొని టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. టైలర్స్ డే సందర్భంగా బ్యానర్ చేతబట్టి పట్టణంలోని సత్రం సెంటర్ నుండి మునిసిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో స్కూటర్ ర్యాలీ కూడా నిర్వహించారు. బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలనేసి అంబేద్కర్ కు నివాళులు సమర్పించారు.. అనంతరం వారు మాట్లాడుతూ టైలర్స్ డే సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ప్రస్తుతం టైలర్ల వృత్తి కష్టతరంగా మారిందని కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చిందని ప్రజల సహకారంతోనే తాము ఇన్నేళ్లు కొనసాగుతూ వచ్చామని ప్రభుత్వం టైలర్స్ ను ఆదుకోవాలని అలాగే కొన్నేళ్లుగా సమస్యగా ఉన్న తమ టైలర్స్ కాలనీలో సమస్యను తీర్చలని కోరారు.. ఈ ర్యాలీలో ఆత్మకూరు ఎస్సై జిలాని పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతూ సంఘీభావం తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాంతా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవుప్, వోల్గా టైలర్ మహబూబ్ బాషా, మార్క్స్ ఖాజామొహిద్దిన్ , యస్దాన్, అక్బర్ బాషా, గోపాల్ , మున్నా, ఇంతియాజ్, రఫీ తదితరులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News