నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 25 : గురువారం ఉదయం బదిలీ పై వచ్చిన అనిల్ కుమార్ తంబళ్లపల్లి యస్.ఐ. గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వులపై పలువురు యస్.ఐ లు ఇటీవల బదిలీ కావడం పాఠకులకు తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో తంబళ్లపల్లి కి ఎస్ఐ గా పనిచేస్తున్న ఉమా మహేశ్వర్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి డిసిఆర్బి కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన యస్.ఐ. గా బదిలీ పై వచ్చిన అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా యస్.ఐ. అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని, శాంతి భద్రతల విషయం లో, అసాంఘిక కార్యక్రమాల పట్ల కఠినంగా ఉంటానని తెలియచేసారు
Reporter
Namitha News