నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె : సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతిలోని ఇంటర్నేసనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు జరిగిన ఉత్తమ విద్యార్థి అభినందన సభ మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం కార్యక్రమం నిర్వహించారు.సంకల్ప సేవా సమితి అధ్యక్షులు నారపరెడ్డి రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తన గానంతో అనేక ప్రపంచ తెలుగు మహాసభలల్లో గానం వినిపించిన మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లెకు చెందిన ఊటుకూరు భూదేవికి చిత్తూరు జిల్లా జిల్లా డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ,డిఈఓ కుమార్ల చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు దక్కడానికి సహకరించిన సంకల్ప సేవా సమితి అధ్యక్షులు నారపరెడ్డి రాజారెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు.ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని,భవిష్యత్తులో పాటలు ద్వారా నా గానాన్ని మరింత విస్తృతం చేసి మదనపల్లె కీర్తి ప్రతిష్టలు పెంచుతానని ఆమె స్పష్టం చేశారు.
Reporter
Namitha News