Sunday, 13 September 2026 07:40:35 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వన్య ప్రాణుల కొరకు విద్యుత్ సరఫరా ఇస్తే కఠిన చర్యలు - విద్యుత్ డి.ఇ. గంగాధరం

Date : 17 December 2025 10:11 PM Views : 330

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 : అటవీప్రాంతం సమీపంలోని పంట పొలాలలో వన్యప్రాణుల (అడవి పందులు) కోసం విద్యుత్ సరఫరా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని విద్యుత్ శాఖ డీ.ఈ. గంగాధరం హెచ్చరించారు. బుధవారం ఆయన కోసువారిపల్లి 11 కెవి వడ్డిపల్లి ఫీడర్ పరిధిలో సుమారు 50 మంది విద్యుత్ సిబ్బంది చేపట్టిన ట్రీ కటింగ్ ను పరిశీలించారు. విద్యుత్ అంతరాయానికి చేపట్టిన ట్రీకటింగ్ మండలంలో విస్తరింపజేయాలని సూచించారు. ప్రభుత్వం వినియోగదారుల సౌకర్యార్థం అడిషనల్ లోడ్ కిలోవాటుకు రూ 2వేలు స్థానే రూ1250కు తగ్గించారని ఈనెల 30వ తేదీ లోపు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ట్రీ కటింగ్ చేపట్టిన విద్యుత్ సిబ్బందిని ప్రశంసిస్తూ బిల్లుల వసూళ్లలో చొరవ చూపాలని, రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు సకాలంలో విద్యుత్ సమస్యలపై స్పందించాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడీలు గోవిందరెడ్డి, సురేంద్రనాయక్, ఏ ఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, సిబ్బంది నాగేంద్ర,అమీన్, శ్రీకాంత్, రాజశేఖర్, ఇంతియాజ్, రాజశేఖర్, సురేష్, మధు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :