నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 : అటవీప్రాంతం సమీపంలోని పంట పొలాలలో వన్యప్రాణుల (అడవి పందులు) కోసం విద్యుత్ సరఫరా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని విద్యుత్ శాఖ డీ.ఈ. గంగాధరం హెచ్చరించారు. బుధవారం ఆయన కోసువారిపల్లి 11 కెవి వడ్డిపల్లి ఫీడర్ పరిధిలో సుమారు 50 మంది విద్యుత్ సిబ్బంది చేపట్టిన ట్రీ కటింగ్ ను పరిశీలించారు. విద్యుత్ అంతరాయానికి చేపట్టిన ట్రీకటింగ్ మండలంలో విస్తరింపజేయాలని సూచించారు. ప్రభుత్వం వినియోగదారుల సౌకర్యార్థం అడిషనల్ లోడ్ కిలోవాటుకు రూ 2వేలు స్థానే రూ1250కు తగ్గించారని ఈనెల 30వ తేదీ లోపు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ట్రీ కటింగ్ చేపట్టిన విద్యుత్ సిబ్బందిని ప్రశంసిస్తూ బిల్లుల వసూళ్లలో చొరవ చూపాలని, రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు సకాలంలో విద్యుత్ సమస్యలపై స్పందించాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడీలు గోవిందరెడ్డి, సురేంద్రనాయక్, ఏ ఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, సిబ్బంది నాగేంద్ర,అమీన్, శ్రీకాంత్, రాజశేఖర్, ఇంతియాజ్, రాజశేఖర్, సురేష్, మధు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News