నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 : తంబళ్లపల్లెలోని గిరిజన బాలుర గురుకులంలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వెంకటరమణ నాయక్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు గురుకులంలో ఉపాధ్యాయుల భర్తీతో పాటు విద్యా ప్రమాణాలు,తరగతి గదులు, భోజన వసతి సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు.2026-2027 విద్యా సంవత్సరానికి గాను 3వ తరగతిలో 40 ఖాళీలు కు ఓసి1, బీసీ2, ఎస్సీ 5, ఎస్టి 32 ఖాళీలు, 4వ, ఐదవ, ఆరవ తరగతులలో 40 ఖాళీలకు మొత్తం ఎస్టి,7వతరగతిలో 35, 8వ తరగతిలో 32 ఖాళీలు,9వ తరగతిలో 33 ఖాళీలు, పదవ తరగతిలో 29 ఖాళీలు మొత్తం ఎస్టి విద్యార్థులకు రిజర్వేషన్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ రిజర్వేషన్ ప్రక్రియలో గురుకులంలో చేరడానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఇతర వివరాలకు ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్ ఫోన్ నెంబర్(9440859247)ను సంప్రదించాలన్నారు
Reporter
Namitha News