నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 05 : ఈస్టర్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనది, మహత్తరమైనది. ఇది యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకునే దినం. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని సమాధుల తోట వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. గుడ్ ఫ్రైడే రోజున సిలువపై మరణించిన యేసుప్రభువు, మూడవ రోజు అయిన ఈస్టర్ ఆదివారం తిరిగి లేచి సజీవుడిగా ప్రత్యక్షమయ్యారని క్రైస్తవ విశ్వాసం.ఈ సందర్భంలో ఆత్మకూరు కు చెందిన పాస్టర్ రెవరెండ్ పరిమి జాన్ ప్రదీప్ పాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు మన పాపముల విముక్తి కోసం తన ప్రాణాన్ని సిలువపై అర్పించిన ఏకైక నిజ దేవుడని పేర్కొన్నారు. ఆయన మరణం మనకు క్షమ, ప్రేమ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని, పునరుత్థానం ఆశ, నూతన జీవితం, నిత్యజీవానికి మార్గదర్శకమని చెప్పారు.ఈస్టర్ పండుగ మనలో చెడు మీద మంచి గెలుస్తుందనే నమ్మకాన్ని పెంపొందిస్తూ, ప్రేమ, శాంతి, సహనంతో జీవించాలని సందేశం ఇస్తుంది. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పలువురు క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేకంగా ధ్యానించారు
Admin
Namitha News