నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామాపురం మే 28 : కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమం సందర్భంగా ఈనెల 29 న రాయచోటి మీదుగా వచ్చే టిడిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి కుటుంబ సభ్యులకు భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డి, నిచ్చల్ నాగిరెడ్డి లు పేర్కొన్నారు. బుధవారం గువ్వలచెరువులో ఏర్పాటు చేసే భోజన వసతులను, వాహన పార్కింగ్ స్థలాన్ని టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్యా రెడ్డి, నిచ్చల్ నాగిరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కడప పట్టణంలో మొట్టమొదటిసారిగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మహానాడు కార్యక్రమానికి రాయచోటి మీదుగా వచ్చే టిడిపి నాయకులు కార్యకర్తలు, టిడిపి కుటుంబ సభ్యులు దాదాపు లక్ష మంది పైచిలుకు ప్రజలకు భోజన వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా వాహనాలలో వచ్చే వారికి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక వాహన పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ గువ్వల చెరువు నందు భోజనం చేసి మహానాడు కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ఈనెల 29 న చివరి రోజు నిర్వహించే మహానాడు కార్యక్రమానికి రాయచోటి ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Reporter
Namitha News