Monday, 08 June 2026 09:58:38 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మదనపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల కార్డ్ ఆన్ సెర్చ్

61 వాహనాలు స్వాధీనం.. అనుమానితులపై నిఘా

Date : 22 December 2025 02:05 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 22 : అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం లోని దక్నీ పేట, పెద్ద మసీదు వీధి, సైదా పేట లో పోలీసులు కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో డిఎస్పీ మహీంద్ర ఆధ్వర్యంలో సీఐ లు మహమ్మద్ రఫి, రాజారెడ్డి, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది సోమవారం వేకువ జాము నుండి తనిఖీలు చేపట్టారు. దక్నీ పేట, పెద్ద మసీదు వీధి, సైదా పేట , అగర్తలా వీధి, ఘోసియా వీధి, త్యాగరాయ వీధి మరియు బాడేమకాన్ ప్రాంతాల్లో పోలీస్ లు కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని మరియు అనుమానాస్పదంగా ఉన్న 61 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులు, రౌడీ షీటర్లు మరియు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, వారిని క్షుణ్ణంగా విచారించారు. ఈ సందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, "ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చేసేందుకే ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాము. ముఖ్యంగా యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరంతరం నిఘా ఉంచుతాము. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలి. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి" అని తెలిపిన డిఎస్పీ మహేంద్ర

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :