నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 22 : అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం లోని దక్నీ పేట, పెద్ద మసీదు వీధి, సైదా పేట లో పోలీసులు కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో డిఎస్పీ మహీంద్ర ఆధ్వర్యంలో సీఐ లు మహమ్మద్ రఫి, రాజారెడ్డి, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది సోమవారం వేకువ జాము నుండి తనిఖీలు చేపట్టారు. దక్నీ పేట, పెద్ద మసీదు వీధి, సైదా పేట , అగర్తలా వీధి, ఘోసియా వీధి, త్యాగరాయ వీధి మరియు బాడేమకాన్ ప్రాంతాల్లో పోలీస్ లు కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని మరియు అనుమానాస్పదంగా ఉన్న 61 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులు, రౌడీ షీటర్లు మరియు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, వారిని క్షుణ్ణంగా విచారించారు. ఈ సందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, "ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చేసేందుకే ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాము. ముఖ్యంగా యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరంతరం నిఘా ఉంచుతాము. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలి. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి" అని తెలిపిన డిఎస్పీ మహేంద్ర
Admin
Namitha News