నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 12 : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఇద్దరు మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో కిడ్నీ రాకెట్ ముఠా చేతల్లో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం కు చెందిన యమున (29) మృత దేహాన్ని అధికారులు, మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీ నుండి బయటకు తీసి గుట్టుచప్పుడు కాకుండా తిరుపతికి తరలించేశారు. ప్రతిపక్ష పార్టీలు శవ రాజకీయాలు చేసే అవకాశం ఉందన్న అనుమానంతో తిరుపతికి పంపించేశారని తెలిసింది. మదనపల్లెలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం, టమోటా మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాలకు రాష్ట్ర ఆరోగ్య, పౌరసరఫరా శాఖల మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో మృతదేహాన్ని తిరుపతికి తరలించడంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి
Admin
Namitha News