నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 23 : ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలను పరిశుబ్రతక లో ప్రజలను భాగస్వామ్యం చేసే బృహత్తర కార్యక్రమం. మునిసిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మునిసిపాలిటీల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభింస్తున్న నేపథ్యంలో నేడు మదనపల్లి పట్టణం లోని అనిబిసెంట్ కూడలి నందు "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్
ఈ సందర్బంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఈ నాలుగు వారాల కార్యక్రమం లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని పిలుపునిస్తూ మదనపల్లి పట్టణం ను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా నాలుగు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ను పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి ప్రారంభించాం . మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్ లని క్లీన్ చేయడం, రెండో వారం కాలువలను క్లీన్ చేయడం,మూడో వారం ఇల్లు,షాపుల వద్ద చెత్తను వేరుచేసేలా, నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ చేసేలా అవగాహన కల్పించాలి. ఇండ్లు, షాప్ ల యజమానులు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తే జరిమానాలు వేస్తాం, షాప్ ల వద్ద వినకపోతే సీజ్ కూడా చేస్తాం అని హెచ్చరించిన కలెక్టర్. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ను విజయవంతం గా పూర్తి చేసి మదనపల్లి పట్టణం ను క్లీన్ మునిసిపాలిటీ గా తీర్చిదిద్దుకుందాం అని వెల్లడించిన కలెక్టర్ నిశాంత్ కుమార్
ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, మునిసిపల్ కమీషనర్ ప్రమీల, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News