నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 30 : తంబళ్లపల్లె ఎంపీడీవో గా ఏడు నెలలలో ఏడింతల మండల అభివృద్ధి సాధించాడని ఆయన సేవలు మరువరానివని జిల్లా స్వర్ణ వార్డు, గ్రామ అభివృద్ధి అధికారి అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. గురువారం ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వక్తలు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ లక్ష్మీపతి, ఇంచార్జ్ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, కార్యాలయ అధికారులు గోపీనాథ్, సురేంద్ర, విజయ్,ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బేరిశ్రీనివాసులు, పురుషోత్తం, కాలా నారాయణ, మండలంలోని అధికారులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఎంపీడీవో దంపతులను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
Reporter
Namitha News