Saturday, 12 September 2026 04:43:54 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ?

గుర్తు తెలియని ఆడ శిశువు మృతి

Date : 29 April 2026 10:25 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రెల్ 29 : కన్నప్రేగుకు భారమై పురిటిబిడ్డను గుర్తు తెలియని మాతృమూర్తి పంటపొలాల్లో వదిలేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చెంబకూరు నుండి ఎలకపల్లి మార్గంలోని పొలాల్లో గుర్తు తెలియని పురిటి శిశువు శవం కలకలం రేపింది. బుధవారం వ్యవసాయ పనినిమిత్తం పొలంలోకి వెళ్లిన ఒక మహిళకు రోజులు కూడా నిండని ఒక ఆడశిశువు శవమై కనిపించడంతో భయంతో పరుగులు తీసింది. విషయం తెలుసుకొన్న మహిళ భర్త సురేంద్ర పోలీసులకు విషయం తెలియచేశాడు. అనంతరం సంఘటన స్థలానికి రామసముద్రం తహసీల్దార్ మహమ్మద్ అజరుద్ధున్, ఎస్సై హృషి కేశవరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విచారించి పసిపాప మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం ఎస్సై మాట్లాడుతూ సంఘటనకు సంబంచిన వివరాలని శవ పంచనామా అనంతరం తెలియచేస్తామని అన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :