నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 13: అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈరోజు (సోమవారం) “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి నిర్వహించి బాధితుల నుండీ ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా ఎస్పీ గారు ప్రజల సమస్యలను నేరుగా విని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించారు, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ-ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు, ప్రేమపేరుతో మోసాలు. మరియు ఇతర సమస్యలపై ఎస్పీ గారు స్వయంగా విచారణ జరిపారు. ఎస్పీ గారు ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, చట్టపరిదిలో "తక్షణ న్యాయం అందించాలి – ఆలస్యం చేయరాదు" అని ఆదేశించారు. చట్టపరమైన చర్యలు తీసుకున్న వెంటనే, వివరాలతో కూడిన నివేదికలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలి అని స్పష్టం చేశారు
Reporter
Namitha News