నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 ః తంబళ్లపల్లె మండల పరిధిలోని పెద్దేరు ప్రాజెక్టు పర్యాటకులకు నిలయంగా ఉండేది. గత రెండేళ్లుగా ఆలనా పాలనా లేక పర్యాటకులు కరువయ్యారు. ఈ విషయమై పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్, కమిటీ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం తంబళ్లపల్లె స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి కి పెద్దేరు ప్రాజెక్టుకు రోడ్డు, పార్క్ మరమ్మతులు, ఇన్నర్ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణాలు, కాలువల నిర్మాణాలు ఇంకా పలు సమస్యలపై ఆయనకు వివరించారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే వ్యవసాయ రంగం తోపాటు వేలాదిమంది పర్యాటకులకు నిలయంగా మారుతుందని ప్రాజెక్టు అభివృద్ధికి సహకరించాలని కోరారు
Reporter
Namitha News