Thursday, 16 April 2026 06:42:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

నిబంధనలకు విరుద్ధంగా సంఘమిత్ర ఎన్నిక జరిగిందంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైటయించిన తంబళ్లపల్లి పల్లి మండలం, కన్నెమడుగు గ్రామపంచాయతీకి చెందిన డ్వాక్రా స

కన్నెమడుగు సంఘమిత్ర నియామకం ను నిరసిస్తూ కలెక్టర్ కు వినతిపత్రం

Date : 14 October 2024 05:49 PM Views : 300

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - అక్టోబర్ 14 : డ్వాక్రా సంఘాలకు కనీస సమాచారం ఇవ్వకుండా సంఘమిత్రను నియమించిన సి సి, ఎ పి యం లు. *నియంతల వ్యవహరిస్తున్న నూతనంగా ఎన్నుకున్న సంఘమిత్ర...* డ్వాక్రా సంఘ సభ్యుల అంగీకారం లేకుండా నూతన సంఘమిత్ర నియామకం జరిగిందంటూ ఆవేదన... కనీసం డ్వాక్రా మహిళా సంఘాలలో సభ్యత్వం లేని వ్యక్తి ని సంఘమిత్రగా నియమించడం వెనక ఆంతర్యమేంటంటున్న డ్వాక్రా సంఘాలు. సమర్థవంతమైన సంఘమిత్రను ఎన్నుకునే హక్కును తమకు కల్పించాలంటూ 27 సంఘాలతో కలిసి జిల్లా కలెక్టర్ ని ఆశ్రయించిన డ్వాక్రా మహిళలు.. డ్వాక్రా మహిళల సమస్యలు తెలిసిన సమర్థవంతమైన సంఘమిత్రను ఎన్నుకునే హక్కు తమకు కల్పించాలంటూ తంబళ్లపల్లి మండలం, కన్నె మడుగు గ్రామపంచాయతీకి చెందిన డ్వాక్రా మహిళలు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ని ఆశ్రయించారు. గతంలో పని చేసినటువంటి సంఘమిత్ర అనారోగ్య కారణంగా ఇటీవల కాలంలో మరణించడంతో నిబంధనలకు విరుద్ధంగా సి సి, ఎ పి యం లు కలసి అర్హత లేని వ్యక్తిని నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన లీడర్లు అందరూ కలిసి డ్వాక్రా సంఘంలోని వ్యక్తిని సంఘమిత్రగా ఎన్నుకునే వారని అందుకు విరుద్ధంగా డ్వాక్రా సంఘాలకు, డ్వాక్రా మహిళలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కనీసం డ్వాక్రా గ్రూప్ లో కూడా లేని మహిళను సంఘమిత్ర గా నియమించడం వెనక ఆంతర్యమేంటో తెలియడం లేదన్నారు. నూతనంగా ఎన్నుకున్న సంఘమిత్ర నియంతల వ్యవహరిస్తుందన్న కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తద్వారా డ్వాక్రా సంఘాలు నెలవారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం లేదని దీని కారణంగా డ్వాక్రా సంగాలతో పాటు ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుందన్నారు. మహిళలు నిర్వహిస్తున్నటువంటి డ్వాక్రా సంఘాలలో సంబంధంలేని పురుషులు ప్రవేశించి తమపై యజమాయిషి చేస్తున్నారని తెలిపారు. ఇదే విషయమై గత నెలలో గ్రీవెన్సెల్ లో తమ సమస్యను తెలియజేసిన ఎటువంటి ప్రయోజనం కనిపించలేదని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వారు తమ సమస్యకు పరిష్కారం చూపి ప్రభుత్వ అధికారుల సమక్షంలో సంఘమిత్రను ఎన్నుకొనే హక్కును తమకు కల్పించాలంటూ కన్నెమడుగు గ్రామ పంచాయతీకి చెందిన 27 సంఘాల డ్వాక్రా మహిళలతో కలసి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :