నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - అక్టోబర్ 03 : జిల్లా ఎస్పీ, కలెక్టర్తో ఎమ్మెల్యే షాజహాన్ భాష భేటీ మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం రాయచోటిలో జిల్లా ఎస్పీ ధీరజ్, కలెక్టర్ నిశాంత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ముందుగా కలిసే అవకాశం లేకపోవడంతో సమావేశాల అనంతరం భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల సమన్వయం, ప్రజల చైతన్యం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ భేటీ ద్వారా ప్రభుత్వ, స్థానిక అధికారుల సమన్వయం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
Namitha News