Thursday, 16 April 2026 04:55:41 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

ప్రతీ రైతు కు యూనిక్ ఐ.డి. ఇస్తాం

Date : 25 February 2025 08:22 AM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 24 : తంబళ్లపల్లె మండలం లో సొంత భూమి కలిగిన రైతులు రైతు విశిష్ట సంఖ్య నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) తప్పక చేయించుకోవాలని మండలంలోని ఏఈఓ లు రైతులకు అవగాహన కల్పించారు. ఏవో రమణ కుమార్ ఆదేశాల మేరకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరణ (డిజిటలైజేషన్) చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 14 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) ఆధార్ కార్డు తరహాలో రైతులకు అందించనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు, రాయితీలు పొందాలంటే సొంత భూమి రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలన్నారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పెట్టుబడి, ఎరువులు రాయితీలు, పంటల బీమా, పంటలకు కనీసం మద్దతు ధర, పంటల రుణాలకు సులువుగా ఉంటుందన్నారు. ప్రతి రైతు పట్టాదారు పాసుబుక్కు లేదా వన్ బి, ఆధార్ జిరాక్సిలు, ఆధార్ లింకు కలిగిన ఫోన్ తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఏఈవోలు సురేష్, అంబేద్కర్, సచివాలయాల పరిధిలోని రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :