నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : వనిత న్యూస్..పుంగనూరు.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం తహసిల్దార్ సీతారాం ను రానున్న ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లాకు బదిలీ కావడంతో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ సభ్యులు రాజా, పెంచుపల్లి కృష్ణప్ప, శంకరప్ప, బాలాజీ, మరియు పి. ఎన్. ఎస్ ప్రకాష్,సతీష్, సైఫుల్లా,గురువారం రాత్రి 8 గంటల సమయంలో సన్మానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సిపి ఎస్సి నాయకులు రాజా మాట్లాడుతూ ఎస్సి ఎస్టీ ల అభివృద్ధి కి ఎనలేని కృషి చేసిన ఏకైక అధికారిగా తాసిల్దార్ సీతారాం మా అందరి మధిలో నిలిచిపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్ది ఎంపీ. మిథున్ రెడ్ది ల సహాయ సహకారాలతో మండలం లో ఎస్సి ల స్మశానాల స్థలాలకు పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్ ని గజమాల వేసి దుశాలువతో సన్మానించి పూలభిషేకం గావించారు.
Reporter
Namitha News